ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ పట్టణంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు నడుస్తున్న కారులో ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు.  ఓ పబ్‌లో పార్టీకి హాజరయిన ఇద్దరు యువతులు  పబ్ బైట వేచి ఉండగా, కారులో వచ్చిన ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడని, కొంతదూరం పోయిన తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కారని ,ఈ ముగ్గురూ కారులోనే తమపై అత్యాచారం చేసారని యువతులు ఆరోపించారని,వైద్య పరీక్షలో ఈ విషయం ధ్రువీకరణ అయిందని, కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు చేపట్టామని,ఢిల్లీ పోలీసు (తూర్పు విభాగం) డిప్యూటీ కమిషనర్ మహేశ్వర్ దయాళ్ విలేఖరులకు చెప్పారు.

Tags: New,Telugu News, Andhra News 
 

0 comments:

Post a Comment

 
Top